రివెంజ్ డ్రామాతో రానున్న మణిరత్నం.!

రివెంజ్ డ్రామాతో రానున్న మణిరత్నం.!

Published on Aug 27, 2015 12:19 PM IST

mani-ratnam
సినిమా ఇండస్ట్రీలో ఏం చెయ్యాలన్నా జోష్ ఫుల్ గా దూసుకు పోవాలన్నా దర్శకులకు, నటులకు కావాల్సింది సక్సెస్. ఎన్ని ఫ్లాప్స్ లో ఉన్న వారికన్నా ఒక్క సక్సెస్ వస్తే వాళ్ళలో నూతన ఉత్సాహం వస్తుంది. ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే.. సౌత్ ఇండియన్ మోస్ట్ ఫేమస్ డైరెక్టర్ మణిరత్నం.. చాలా రోజుల తర్వాత ఈ ఏడాది ‘ఓకే కన్మణి లేదా ఓకే బంగారం’ సినిమాతో హిట్ అందుకున్నాడు. ఈ సినిమా సక్సెస్ ఇచ్చిన ఎనర్జీతో మణిరత్నం తన తదుపరి సినిమాని సిద్దం చేసేసాడు. కథతో పాటు ఓ క్రేజీ కాంబినేషన్ ని కూడా సెట్ చేసాడు. వాళ్ళే తమిళ యంగ్ హీరో కార్తీ – మలయాళ యంగ్ హీరో దల్క్వేర్ సల్మాన్. గత కొద్ది రోజులుగా మణిరత్నం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉన్నాడు.

ఇటీవలే మణిరత్నం ఈ సినిమాపై స్పందిస్తూ డిసెంబర్ నుంచి సెట్స్ పైకి తీసుకెళ్ళనున్న ఈ సినిమాని 2016 సమ్మర్ కానుకగా రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా గురించిన మరో ఆసక్తికర విషయం తెలిసింది. ఓకే కన్మణితో మనకు ప్యూర్ లవ్ స్టొరీని చెప్పిన మణిరత్నం ఈ సారి ప్యూర్ రివెంజ్ డ్రామా కథని సిద్దం చేసాడట. అలాగే ఇందులో సూపర్బ్ యాక్షన్ ఎపిసోడ్స్ కూడా ఉంటాయని సమాచారం. మణిరత్నం ఒకేసారి తమిళ్ – మలయాళ భాషల్లో షూట్ చేయనున్నారు. ఈ ద్విభాషా చిత్రం మలయాళ వెర్షన్ లో మమ్ముట్టి ఓ మెయిన్ రోల్ లో కనిపించనున్నాడు.

తమిళ్, మలయాళంతో పాటు తెలుగులో కూడా కార్తీ,మణిరత్నం సినిమాలకి మంచి క్రేజ్ ఉండడం వలన తెలుగులో కూడా ఈ సినిమాని రిలీజ్ చేస్తారు. నయనతార, శృతి హాసన్ లు హీరోయిన్ గా ఫైనలైజ్ అయిన ఈ సినిమాకి ఎఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించనున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు