ప్రేమికుల రోజునే మణిరత్నం రొమాంటిక్ డ్రామా!

ప్రేమికుల రోజునే మణిరత్నం రొమాంటిక్ డ్రామా!

Published on Oct 18, 2016 11:02 PM IST

mani-ratnam
మణిరత్నం సినిమాలంటే, ఏళ్ళు గడిచినా ఎప్పటికప్పుడు కొత్తగా కనిపించేంత క్లాసిక్స్‌ అన్న పేరుంది. ఇండియన్ సినిమాకు గర్వ కారణంగా నిలిచిన దర్శకుల్లో ఒకరైన ఆయన, కొద్దికాలంగా ఓ సరైన కమర్షియల్ సక్సెస్ కోసం ఎదురుచూడగా, ‘ఓకే బంగారం’తో అది నెరవేరింది. ఇక ఆ సినిమా విజయంతో రెట్టించిన ఉత్సాహంతో ఆయన తన కొత్త సినిమా ‘కాట్రు వెళదిలై’ని శరవేగంగా పూర్తి చేస్తున్నారు. కార్తీ, అదితిరావు హైదరి హీరో, హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ రొమాంటిక్ డ్రామా ప్రస్తుతం కశ్మీర్‌లోని లడఖ్‌లో షూటింగ్ జరుపుకుంటోంది.

ఈ షెడ్యూల్‌లో పలు యాక్షన్ సన్నివేశాలతో పాటు కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. నవంబర్ కల్లా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకోనున్న ఈ సినిమాను ఫిబ్రవరి నెలలో, వాలెంటైన్స్‌ వీక్‌కు ప్రేక్షకులకు ముందుకు తెచ్చేలా మణిరత్నం ప్లాన్ చేస్తున్నారట. మద్రాస్ టాకీస్ పతాకంపై మణిరత్నం స్వయంగా నిర్మిస్తోన్న ఈ సినిమాలో కార్తీ ఓ యుద్ధ విమాన పైలెట్‌గా కనిపించనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు