ఏప్రిల్ నెలలో మణిరత్నం ‘ఒకే బంగారం’..?

ఏప్రిల్ నెలలో మణిరత్నం ‘ఒకే బంగారం’..?

Published on Jan 28, 2015 12:52 PM IST

mani-ratnam

మలయాళ నటుడు మమ్ముట్టి వారసుడు దుల్కర్ సల్మాన్, నిత్యా మీనన్ జంటగా క్రియేటివ్ జీనియస్ మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతున్న తమిళ సినిమా ‘ఓకే కన్మణి’. తెలుగులో ‘ఒకే బంగారం’ పేరుతో అనువదిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను ఏప్రిల్ నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

‘ఒకే కన్మణి ట్రెండ్ సెట్టింగ్ లవ్ స్టొరీ. ఈ సినిమాలో క్యారెక్టర్లు ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తాయి. మణిరత్నం ఈ సినిమాతో తన స్ట్రెంగ్త్ ఏంటి అనేది చూపిస్తాడు. ఈ సినిమా మణి గురించి మాట్లాడుతుంది. వెయిటింగ్ ఫర్ ఏప్రిల్.. ‘ అని సినిమాటోగ్రాఫర్ పిసి శ్రీరామ్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు.

మణిరత్నం కెరీర్ లో అత్యంత వేగంగా చిత్రీకరణ పూర్తి చేసుకుంటున్న సినిమాగా ‘ఓకే కన్మణి’ రికార్డులకు ఎక్కింది. ప్రకాష్ రాజ్, కనిక కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకుడు. మణిరత్నం మార్క్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు