త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న మణిరత్నం మూవీ

త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న మణిరత్నం మూవీ

Published on Oct 2, 2014 3:00 AM IST

Mani-Ratnam
సౌత్ ఇండియన్ లేజండ్రీ డైరెక్టర్ అయిన మణిరత్నం తన తదుపరి సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్ళడానికి రంగం సిద్దం చేసుకున్నారు. తాజా సమాచారం ప్రకారం తన కొత్త సినిమా అక్టోబర్ 6 నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాలో మలయాళ యంగ్ సెన్సేషన్ దల్క్వేర్ సల్మాన్ హీరోగా నటిస్తున్నాడు. మలయాళ సూపర్ స్టర్ మమ్ముట్టి తనయుడే దల్క్వేర్ సల్మాన్. ఇందులో సల్మాన్ సరసన నిత్యా మీనన్ హీరోయిన్ గా నటించనుంది.

దీనికంటే ముందు మణిరత్నం కింగ్ నాగార్జున – సూపర్ స్టార్ మహేష్ బాబులతో ఓ సినిమాని ప్లాన్ చేసారు. కానీ ఈ సినిమా కార్యరూపం దాల్చలేదు. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి – రామ్ చర్రాన్ లకి కథ చెప్పారు. ఆయన చెప్పిన కథ వీళ్ళకి సెట్ అవ్వదని చిరు సున్నితంగా తిరష్కరించారు. ప్రస్తుతం అదే కాన్సెప్ట్ ని దల్క్వేర్ సల్మాన్ తో తీస్తున్నారు. మరి మన తెలుగు వారు వద్దన్న కాన్సెప్ట్ మలయాళ, తమిళ ప్రేక్షకులని మెప్పిస్తుందేమో చూడాలి..

సంబంధిత సమాచారం

తాజా వార్తలు