70 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న మాస్ హీరో సినిమా !

70 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న మాస్ హీరో సినిమా !

Published on Mar 20, 2018 7:38 PM IST

గోపీచంద్ హీరోగా శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతున్న సినిమా పంతం. నూతన దర్శకుడు చక్రి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. మే 18న ఈ సినిమాను విడుదల చెయ్యబోతున్నట్లు చిత్ర యూనిట్ గతంలో ప్రకటించడం జరిగింది. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకేక్కబోతున్న ఈ సినిమా షూటింగ్ 70 శాతం పూర్తి అయ్యింది.

గోపిసుందర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తోన్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ఈ నెల 22న విడుదల చెయ్యబోతున్నారు దర్శక నిర్మాతలు. మెహరిన్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో గోపీచంద్ ఎన్ఆర్ఐ పాత్రలో కనిపించబోతున్నాడు. గోపీచంద్ చేస్తున్న 25 సినిమా కావడంతో అభిమానుల్లో ఈ సినిమాపై భారి అంచనాలు ఉన్నాయి. త్వరలో మిగిలిన షూట్ పూర్తి చేసి, పాటలను విడుదల చెయ్యబోతున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు