జేమ్స్ కామెరూన్ అడిగినా నో చెప్తానన్న మెగా హీరో !

జేమ్స్ కామెరూన్ అడిగినా నో చెప్తానన్న మెగా హీరో !

Published on Feb 26, 2017 10:00 PM IST


యంగ్ మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన ‘విన్నర్’ చిత్రం గత శుక్రవారం అలై బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ రాబట్టింది. ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా రూ. 6. 4 కోట్ల షేర్ వసూలు చేసిన ఈ చిత్రం ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన 3వ చిత్రంగా నిలిచింది. ఇక చిత్ర యూనిట్ కూడా ప్రమోషన్ల వేగం పెంచి సినిమాను ఇంకాస్త ఎక్కువగా జనాల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

ఈ ప్రమోషన్లలో భాగంగా మీడియా ఇంటర్వూలో మాట్లాడిన ధరమ్ తేజ్ ఒక ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు. అదేమిటంటే సినిమాకు సంబందించిన ఏ జానర్ చేయడానికైనా తాను సిద్ధంగా ఉన్నాను కానీ హర్రర్ జానర్ మాత్రం అస్సలు ముట్టుకోనని చెప్పిన తేజ్ ఏకంగా ప్రపంచ ప్రఖ్యాత హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ స్వయంగా వచ్చి హర్రర్ జానర్లో సినిమా చేద్దామని అడిగినా ఏమాత్రం ఆలోచించకుండా నో చెప్పేస్తానని అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు