ఖైదీ కి డబ్బింగ్ చెప్పడం మొదలుపెట్టేసిన చిరంజీవి

ఖైదీ కి డబ్బింగ్ చెప్పడం మొదలుపెట్టేసిన చిరంజీవి

Published on Sep 24, 2016 7:20 PM IST

chiranjeevi
మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం ‘ఖైదీ నెం 150’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. చిరంజీవి కూడా షూటింగ్ లో బిజీబిజీగా గడుపుతున్నారు. అనుకున్న సమయానికే సినిమాని విడుదల చేయాలని ప్రయత్నిస్తున్నారు. 8 ఏళ్ళ తరువాత హీరోగా చేస్తున్నప్పటికీ పాత స్పీడుతోన్ యూనిట్ ను పరుగులు పెట్టిస్తున్నారు. ఇందులో భాగంగా ఈరోజు నుండి చిరు తన పాత్రకి డబ్బింగ్ చెప్పడం ప్రారంబించారు. అంతేగాక త్వరగా చిత్ర షూటింగ్ ను ముగించేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులను మొదలుపెట్టాలని చూస్తున్నారు.

మరోవైపు నిర్మాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరికొత్త తరహాలో చిత్ర ప్రమోషన్లు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఇకపోతే వినాయక్ డైరెక్ట్ చేస్తునం ఈ చిత్రంలో చిరు సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. దేవి శ్రీ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని ‘కొణిదల ప్రొడక్షన్స్ బ్యానర్’ పై నిర్మిస్తున్నారు. ఇకపోతే సినిమా సంక్రాంతి సందర్బంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు