సాహో అసలు పాయింట్ అదేనట!

సాహో అసలు పాయింట్ అదేనట!

Published on Apr 22, 2018 4:46 PM IST

బాహుబలి సినిమా తరువాత ప్రభాస్ నుంచి వస్తోన్న సాహో ఎలా ఉంటుందా.. అని ప్రస్తుతం సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న సినిమా కావడంతో దాదాపు అన్ని భాషల్లో సినిమాకు మంచి మార్కెట్ ఏర్పడింది. అంచనాలు కూడా భారీగా పెరిగాయి. తప్పకుండా సాహో కూడా టాలీవుడ్ స్థాయిని పెంచుతుంది అనే తరహాలో కామెంట్స్ వస్తున్నాయి. ఇకపోతే ఇటీవల సినిమాకు కథకు సంబందించిన ఒక చిన్న సీక్రెట్ బయటపడింది.

సాహో కథ ఒక రివేంజ్ డ్రామా తరహాలో సాగుతుందట. అలాగే ఒక ముఖ్యమైన సోషల్ మెస్సేజ్ కూడా ఉంటుందని తెలిసింది. సినిమాలో ప్రభాస్ యాక్షన్ సీన్స్ కోసం చాలా కష్టపడుతున్నాడు. వీలైనంత వరకు సొంతంగా యాక్షన్స్ సీన్స్ లో తన సత్తాను చాటుతున్నాడట. సినిమాలో యాక్షన్ సీన్స్ కోసం యూవీ క్రియేషన్స్ ఖర్చు భారీగానే పెడుతోంది. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో శ్రద్దా కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు