ఎప్పుడూ మీ గురించే ఆలోచిస్తుంటాం నాన్న – నాగార్జున

ఎప్పుడూ మీ గురించే ఆలోచిస్తుంటాం నాన్న – నాగార్జున

Published on May 23, 2018 11:00 AM IST

‘మనం’.. ఈ సినిమాకు ఎన్నో ప్రత్యేకతలున్నాయి. అక్కినేని కుటుంబంలోని మూడు తరాల హీరోలు ఈ సినిమాలో కనిపించారు. లెజెండ్ అక్కినేని నాగేశ్వరరావుగారు నటించిన చివరి చిత్రం కూడ ఇదే. అందుకే ఈ సినిమా అక్కినేని హీరోలకు ఎంతో అమూల్యమైనది. ఈ మే 23కి ఈ చిత్రం విడుదలై నాలుగేళ్లు పూర్తైంది. అంతేగాక ఈరోజుటితో నటుడిగా 32 ఏళ్లను పూర్తిచేసుకున్నారు.

ఈ సందర్బంగా తన తండ్రి ఏఎన్నార్ ను గుర్తుచేసుకున్న నాగార్జున ‘మనం విడుదలై నాలుగేళ్లు కావొస్తోంది. నేనెప్పుడూ ఆలోచిస్తుంటా మీరు మమ్మల్ని ఎలా నవ్వించారు, ఏడిపించారు, కుటుంబం మొత్తానికి జీవితాన్ని, చావుని ఎదుర్కోనే స్ఫూర్తినిచ్చారు అని. ఎప్పుడూ మీ గురించే ఆలోచిస్తుంటాం నాన్న’ అంటూ ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశారు.

అంతేగాక ఇదే మే 23న తన మొదటి సినిమా ‘విక్రమ్’, తన తండ్రి చివరి సినిమా ‘మనం’ విడుదలయ్యాయని కూడ గుర్తుచేసుకున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు