రైల్వే స్టేషన్ లో ‘బెంగాల్ టైగర్’ రొమాన్స్

రైల్వే స్టేషన్ లో ‘బెంగాల్ టైగర్’ రొమాన్స్

Published on Apr 24, 2015 8:29 AM IST

ravitaja
‘పవర్’ సినిమా తర్వాత మాస్ మహారాజ్ రవితేజ నటిస్తున్న మరో పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘బెంగాల్ టైగర్’. ఈ మూవీలో రవితేజ సరసన తమన్నా, రాశి ఖన్నాలు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ హైదరాబాద్లో జరుగుతున్నా సంగతి మీకు తెలిసిందే. రెండు రోజుల క్రితమే ఈ చిత్ర టీం శంషాబాద్ లో ఓ యాక్షన్ ఎపిసోడ్ ని ఫినిష్ చేసారు. అక్కడి నుంచి ఈ చిత్ర టీం రామోజీ ఫిల్మ్ సిటీకి షిఫ్ట్ అయ్యింది. నిన్నటి నుంచి రామోజీ ఫిల్మ్ సిటీలోని రైల్వే స్టేషన్ లో కొన్ని సన్నీ వేషలను షూట్ చేస్తున్నారు.

ఈ రైల్వే స్టేషన్ లో రవితేజ తమన్నా, రాశి ఖన్నాలతో రొమాన్స్ చేస్తున్నాడు. ‘ఏమైంది ఈవేళ’, ‘రచ్చ’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన సంపత్ నంది ఈ సినిమాకి డైరెక్టర్. రవితేజ బాడీ లాంగ్వేజ్ కి సూటయ్యే విధంగా సంపత్ నంది అవుట్ & అవుట్ కమర్షియల్ ఎంటర్టైనర్ స్క్రిప్ట్ సిద్దం చేశారని యూనిట్ వర్గాల చెబుతున్నాయి. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కేకే రాధామోహన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. బొమన్ ఇరానీ, నాజర్, తనికెళ్ల భరణి, రావు రమేష్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీ సెప్టెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది కాకుండా రవితేజ నటించిన కిక్ 2 సినిమా కూడా చివరి దశకు చేరుకుంది. కిక్ 2 సినిమా మే మిడిల్ లో రిలీజ్ కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు