మోహన్ బాబుకు ‘గోపాల రెడ్డి’ స్మారక అవార్డు.

మోహన్ బాబుకు ‘గోపాల రెడ్డి’ స్మారక అవార్డు.

Published on Oct 21, 2014 8:55 PM IST

Mohan-Babu-162
ప్రముఖ సినీ నటుడు, నిర్మాత.. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరింది. దిగవంత రాజకీయ నాయకుడు, సాహితివేత్త అయిన ‘బెజవాడ గోపాల రెడ్డి’ స్మారక అవార్డును మోహన్ బాబుకు ప్రధానం చేశారు. మంగళవారం హైదరాబాద్ లో జరిగిన ఓ కార్యక్రమంలో తమిళనాడు గవర్నర్ రోశయ్య ఈ అవార్డును అందజేశారు. ఒక నటుడిగా, విద్యావేత్తగా సమాజానికి మోహన్ బాబు చేసిన సేవలకు గాను ఈ అవార్డును అందుకున్నారు.

ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ.. ప్రస్తుతం 90 శాతం రాజకీయాలు కలుషితం అయ్యాయి. 10 శాతం మంది నాయకులు మాత్రమే మంచివారు ఉన్నారు. అలాంటి ఒక నిజాయితి గల రాజకీయ నాయకుడు ‘బెజవాడ గోపాల రెడ్డి’ పేరు మీద ఇస్తున్న ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. అని అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు