100 కోట్ల క్లబ్‍లో చేరిపోయిన ‘ఎం.ఎస్.ధోనీ’..!

100 కోట్ల క్లబ్‍లో చేరిపోయిన ‘ఎం.ఎస్.ధోనీ’..!

Published on Oct 10, 2016 8:26 AM IST

ms-dhoni
క్రికెట్‌కు కొత్త కళ తీసుకొచ్చి, ఇండియాకు క్రికెట్‌లో తిరుగులేని విజయాలను అందించిన ఎం.ఎస్.ధోని జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘ఎం.ఎస్.ధోని’, సెప్టెంబర్ 30న విడుదలై పెద్ద హిట్ కొట్టిన విషయం తెలిసిందే. క్రికెట్‌లో తన ఆటతో అభిమానులను ఎలా కట్టిపడేస్తాడో, ధోనీ తన కథతోనూ అభిమానులను అలాగే కట్టిపడేశాడు. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు నీరజ్ పాండే తెరకెక్కించిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలను అందుకోవడంతో పాటు బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపిస్తూ దూసుకుపోతోంది.

హిందీ, తెలుగు, తమిళం అన్ని భాషల్లోనూ సినిమా మంచి వసూళ్ళు రాబడుతోంది. ఇక 9 రోజుల్లోనే ఈ సినిమా దేశవ్యాప్తంగా 100 కోట్ల మార్క్‌ను దాటేసింది. ఎక్కువగా సూపర్ స్టార్‌డమ్ ఉన్న హీరోలకు మాత్రమే సాధ్యమయ్యే ఈ ఫీట్ ధోనికి దక్కడం విశేషమనే చెప్పాలి. బాలీవుడ్‌లో హీరోగా ఇప్పుడిప్పుడే గుర్తింపు తెచ్చుకుంటోన్న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ధోని పాత్రలో అద్భుతంగా నటించి టాప్ స్టార్స్ జాబితాలో చేరిపోయారు. ఈ దసరా సీజన్‌కు బాలీవుడ్‌లో పెద్దగా సినిమాలు లేకపోవడం ధోనికి మరింత కలిసొచ్చేదిగా కనిపిస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు