రజినీ 2.0 చిత్ర వాయిదా ఊహాగానాలు నిజం కాదు

రజినీ 2.0 చిత్ర వాయిదా ఊహాగానాలు నిజం కాదు

Published on Aug 19, 2017 8:58 PM IST

రోబో చిత్రానికి సీక్వెల్ గా దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న చిత్రం 2.0. ఈ చిత్రం లో సూపర్ స్టార్ రజిని హీరోగా చేస్తుంటే, బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ప్రతినాయకుడిగా కనిపిస్తున్నాడు. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం దేశవ్యాప్తంగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. అభిమానుఅల్ను నిరాశ పరిచే విధంగా ఈ చిత్ర విడుదల వాయిదా పడిందని ఈరోజు వార్తలు వచ్చాయి. తమిళ మీడియా ఈ చిత్రం వాయిదా పడినట్లు తెలిపింది.

కానీ ప్రముఖ బాలీవుడ్ఇ క్రిటిక్ తరుణ్ ఆదర్శ్ ఈ వార్తల్లో నెలకొన్న గందరగోళాన్ని తొలగించారు. 2.0 చిత్రం వాయిదా పడిందని వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని ఆయన తేల్చారు. ముందుగా అనుకున్న విధంగానే ఈ చిత్రం 25 జనవరి 2018 న విడుదలవుతుందని సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ఈ చిత్రం లో అక్షయ్ కుమార్, రజిని కాంత్ ల షూటింగ్ పూర్తయింది. అత్యంత కీలకమైన గ్రాఫిక్స్ వర్క్ ఇప్పుడు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు