కొచ్చాడయాన్, లింగా లాంటి రెండు వరుస ఫ్లాపుల తర్వాత రజనీకాంత్ కొత్త సినిమా పట్ల చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. లింగా విడుదలై మూడు నెలలైనా ఇప్పటికీ ఏ సినిమానీ అంగీకరించలేదు. తాజా సమాచారం మేరకు రజనీ, మురుగదాస్తో సినిమా తీసేందుకు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. మురుగదాస్ అయితే బలమైన కథని కమర్షియల్ ఎలిమెంట్స్తో డీల్ చేయగల సమర్ధుడని ఆయన భావిస్తున్నారు. రమణ, గజినీ, స్టాలిన్, 7th సెన్స్, కత్తి లాంటి సినిమాలతో సామాజిక అంశాలను అత్యంత ప్రతిభావంతగా తెరకెక్కించిన దర్శకుడిగా మురుగదాస్కు పేరుంది.
‘రమణ’ సినిమా తెలుగులో ‘ఠాగూర్’ పేరుతో రీమేకై ఎంతటి సంచలన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు మళ్ళీ అలాంటి ఒక బలమైన కథతో రజనీ సినిమా ఉండేలా మురుగదాస్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ప్రస్తుతం మురుగదాస్, బాలీవుడ్లో ఓ సినిమా చేస్తున్నారు. సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు ‘అకిరా’ అన్న పేరును ఖరారు చేశారు. ఇంతకుముందే తెలియజేసినట్లు పకడ్బందీ స్క్రిప్ట్తో తెరకెక్కనున్న ఈ సినిమాను చాలా తక్కువ సమయంలో పూర్తి చేసేలా షెడ్యూల్ తయారు చేశారు. ఈ సినిమా పూర్తి కాగానే రజనీ సినిమా పట్టాలెక్కే సూచనలు కనిపిస్తున్నాయి.