విశాల్ సినిమాను వదిలేసిన పాపులర్ డైరెక్టర్

విశాల్ సినిమాను వదిలేసిన పాపులర్ డైరెక్టర్

Published on Feb 23, 2020 5:27 PM IST

హీరో విశాల్ కెరీర్లో ‘తుప్పరివాలన్’ ఒక మంచి సినిమాగా నిలిచింది. ఈ చిత్రాన్ని మిస్కిన్ డైరెక్ట్ చేశారు. ఈ చిత్రం హిట్ కావడంతో సీక్వెల్ అనౌన్స్ చేశారు. గతేడాది నవంబర్లో షూటింగ్ స్టార్ట్ చేశారు. అది కూడా లండన్లో. అక్కడే కొంత చిత్రీకరణ జరిగాక దర్శకుడికి, హీరోకు బడ్జెట్ విషయంలో విభేదాలు తలెత్తాయి. మిస్కిన్ ఈ సీక్వెల్ కోసం సుమారు రూ.40 కోట్లు కావాలని అడిగారట.

కానీ నిర్మాతగా వ్యవహరిస్తున్న విశాల్ అంత భారీ మొత్తం పెట్టలేనని తేల్చి చెప్పాడట. అంతేకాదు చిత్రంలోని మరొక కీలక నటుడు ప్రసన్న, మిస్కిన్ మధ్య కూడా భేధాబిప్రాయాలు తలెత్తాయట. దీంతో మిస్కిన్ ప్రాజెక్ట్ నుండి బయటకువచ్చేసినట్టు తెలుస్తోంది. ఇక చేసేది లేక విశాల్ మిగతా భాగాన్ని స్వయంగా డైరెక్ట్ చేసే ఆలోచనలో ఉన్నారని తమిళ సినీ వర్గాల సమాచారం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు