రేపటి నుండి ‘నా పేరు సూర్య’ క్లైమాక్స్ !

రేపటి నుండి ‘నా పేరు సూర్య’ క్లైమాక్స్ !

Published on Feb 11, 2018 3:11 PM IST

‘చచ్చిపోతాను గాడ్ ఫాదర్.. కానీ ఇక్కడ కాదు. బోర్డర్ కెళ్ళి’ అంటూ ‘నా పేరు సూర్య’ సినిమాలో అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్ అభిమానుల్ని, ప్రేక్షకుల్ని ఒక ఊపు ఊపేసింది. ఫస్ట్ ఇంపాక్ట్ తోనే బోలెడంత క్రేజ్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టీమ్ కూడా అనుకున్న సమయానికి సినిమాని రీలీజ్ చేసేందుకు శరవేగంగా షూటింగ్ జరుపుతోంది.

ఇప్పటికే చాలా వరకు చిత్రీకరణ పూర్తికాగా రేపటి నుండి కీలకమైన క్లైమాక్స్ షూటింగ్ మొదలుకానుంది. ఈ చిత్రం కోసం బన్నీ యూఎస్ ట్రైనర్ల వద్ద కఠినమైన శిక్షణ తీసుకుని, సరికొత్త మేకోవర్ తో కనిపిస్తున్నారు. వక్కంతం వంశీ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో బన్నీ సరసన అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటించగా సీనియర్ హీరో యాక్షన్ కింగ్ అర్జున్ బన్నీకి తండ్రి పాత్రలో కనిపించనున్నారు. లగడపాటి శ్రీధర్ నిర్మాణంలో నాగబాబు సమర్పిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 27న రిలీజ్ కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు