మొన్న ఊటీ.. రేపు గోవా అంటున్న బన్నీ !

మొన్న ఊటీ.. రేపు గోవా అంటున్న బన్నీ !

Published on Nov 29, 2017 1:13 PM IST

రచయిత వక్కంతం వంశీ దర్శకుడిగా మారుతూ చేస్తున్న తొలి చిత్రం ‘నా పేరు సూర్య’ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ చిత్రంలో కథా నాయకుడిగా నటిస్తున్నారు. నిన్న మొన్నటి వరకు హైదరాబాద్లో షూటింగ్ జరిపిన టీమ్ తర్వాతి షెడ్యూల్ కోసం గోవా వెళ్లనున్నారు. రేపటి నుండే షూట్ మొదలుకానుంది. ఇది వరకు కూడా ఒక షెడ్యూల్ ను ఊటీలో చేసిన సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో ఆర్మీ అధికారిగా కనిపించనున్న అల్లు అర్జున్ ఖచ్చితమైన లుక్ కోసం యూఎస్ ట్రైనర్ల వద్ద కఠినమైన శిక్షణ తీసుకుంటున్నాడు. యాక్షన్ కింగ్ అర్జున్, శరత్ కుమార్ వంటి సీనియర్ స్టార్ నటులు నటిస్తున్న ఈ ప్రాజెక్టుకు విశాల్ – శేఖర్ సంగీతాన్ని అందిస్తున్నారు. శిరీష, శ్రీధర్ లగడపాటి, బన్నీ వాసులు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 27న భారీ ఎత్తున రిలీజ్ చేయనున్నారు. అంతేగాక తెలుగుపాటు బన్నీకి మంచి ఫాలోయింగ్ ఉన్న మలయాళంలో కూడా ఒకేసారి చిత్రాన్ని విడుదలచేయాలనే యోచనలో ఉన్నారట మేకర్స్.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు