నాగ చైతన్య ‘మజ్నూ’ ప్రారంభమైంది..!

నాగ చైతన్య ‘మజ్నూ’ ప్రారంభమైంది..!

Published on Nov 28, 2015 4:06 PM IST

naga-chaitanya
మళయాలంలో సంచలన విజయం సాధించిన ‘ప్రేమమ్’ సినిమాను తెలుగులో అక్కినేని నాగ చైతన్య ‘మజ్నూ’ పేరుతో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రేమకథలతో ఇప్పటికే యువతలో మంచి ఫాలోయింగ్ సంపాదించిన చైతూ, ఈ సినిమా తనకు మరింత పేరు తెచ్చిపెడుతుందన్న నమ్మకంతో ఉన్నారు. ప్రస్తుతం ఆయన దర్శకుడు గౌతమ్ మీనన్‌తో చేస్తోన్న ‘సాహసం శ్వాసగా సాగిపో’ను చివరిదశకు చేర్చేసి, అప్పుడే మజ్నూను కూడా మొదలుపెట్టేశారు.

‘కార్తికేయ’ సినిమాతో సూపర్ హిట్ కొట్టి దర్శకుడిగా పరిచయమైన చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందనున్న మజ్నూ సినిమా ఈ ఉదయం హైద్రాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో నాగ చైతన్య, అఖిల్, అనుపమ పరమేశ్వరన్, చందూ మొండేటి తదితరులు పాల్గొన్నారు. నాగ చైతన్య సరసన అనుపమ పరమేశ్వరన్, శృతి హాసన్. ఇషాలు హీరోయిన్లుగా నటించనున్నారు. ‘సాహసం శ్వాసగా సాగిపో’ పూర్తయ్యాక ‘మజ్నూ’ సెట్స్‌పైకి వెళ్ళనుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు