తనకీ కోపం ఎక్కువ అంటున్న టాలీవుడ్ యువ నటుడు!

తనకీ కోపం ఎక్కువ అంటున్న టాలీవుడ్ యువ నటుడు!

Published on Jan 27, 2020 9:54 AM IST

హీరో నాగ శౌర్య తన రాబోయే అశ్వథామ చిత్రానికి దూకుడుగా ప్రచారం చేస్తున్నారు. ఈ చిత్రం జనవరి 31 న విడుదలకు సిద్ధంగా వుంది . ఈ చిత్రంలో నాగ శౌర్య హీరోగా నటించడం, సినిమాను నిర్మించడమే కాకుండా, తన స్నేహితుడి సోదరి కథ నుండి ప్రేరణ పొందిన తరువాత నాగ శౌర్య ఈ చిత్రానికి స్క్రిప్ట్ రాశారు.

నాగ శౌర్య తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కోపం గురించి చెప్పాడు. అవును, నేను షార్ట్ టెంపర్ అని అన్నారు. తరచుగా నా దర్శకులు, రచయితలు మరియు కెమెరామెన్‌ల ఫై అరుస్తాను అని అన్నారు. . అయితే మంచి అవుట్‌పుట్ సాధించడానికి సినిమా కోసమే నేను ఇవన్నీ చేస్తున్నాను. సినిమా బాగా నడుస్తేనే మా కెరీర్లు బాగా వృద్ధి చెందుతాయి. నేను వారి కెరీర్ కోసమే నా టీం ఫై అరుస్తాను. ఇది ఆందోళనతో కూడుకున్నది తప్ప మరేమీ కాదు అని శౌర్య అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు