ఆ వార్త విని ఆశ్చర్యానికి గురైన నాగార్జున !

ఆ వార్త విని ఆశ్చర్యానికి గురైన నాగార్జున !

Published on Jan 19, 2017 10:51 AM IST

Nagarjuna
కొన్ని రోజులుగా అక్కినేని నాగార్జున, ఆయన పెద్ద కుమారుడు నాగచైతన్య కలిసి సినిమా చేయనున్నారనే వార్త మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా గతంలో అక్కినేని మూడు తరాల హీరోలు కలిసి చేసిన ‘మనం’ తరహాలో ఉండబోతోందని, ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాణంలో మొదటి సినిమా ‘శతమానంభవతి’తోనే మంచి హిట్ అందుకున్న దర్శకుడు ‘సతీష్ వేగేశ్న’ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తాడనేది ఆ వార్తల సారాంశం.

ఈ ప్రాజెక్టుని స్వయంగా దిల్ రాజే ప్రకటించేశారని, త్వరలోనే ప్రాజెక్ట్ మొదలుతుందని కూడా బలమైన ఊహాగానాలు వినబడ్డాయి. కానీ ఈ వార్తలు విని ఆశ్చర్యానికి గురైన నాగార్జున ‘నేను, చైతన్య కలిసి సినిమా చేస్తున్నామనే వార్తలు వినబడుతున్నాయి. ఇది నాక్కూడా పెద్ద న్యూస్ లానే ఉంది’ అంటూ ఆ వార్తల్లో వాస్తవం లేదని, అలాంటి ప్లాన్స్ ఏవీ లేవని ట్విట్టర్ ద్వారా తేల్చేశారు. ప్రస్తుతం నాగార్జున రాఘవేంద్ర రావు డైరెక్షన్లో చేసిన ‘ఓం నమో వెంకటేశాయ’ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉండగా నాగ చైతన్య కళ్యాణ్ కృష్ణ సినిమాతో బిజీగా గడుపుతున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు