ఆ రెండింటిని ఎంజాయ్ చేస్తున్న నాగార్జున

ఆ రెండింటిని ఎంజాయ్ చేస్తున్న నాగార్జున

Published on Jul 26, 2014 1:50 PM IST

Nagarjuna

వెండితరపై వైవిధ్యమైన పాత్రలు చేసిన కింగ్ నాగార్జున వ్యాఖ్యాతగా మారి చేసిన మొట్ట మొదటి బుల్లితెర రియాలిటీ షో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’. ఈ రియాలిటీ షో కి విశేష ఆదరణ లభించడమే కాకుండా బుల్లితెర టిఆర్పి రేటింగ్స్ లో కూడా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ షో చెయ్యడంలో నాగార్జున కూడా చాలా హ్యాపీగా ఉన్నాడు.

ఈ షో కారణంగా ఆయన ప్రెజర్ ని మరియు ఈ షో వాళ్ళ వచ్చే ఆనందాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నానని అంటున్నారు. ‘మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రాం వల్ల నాకు వస్తున్న ప్రెజర్ ని ఎంజాయ్ చేస్తున్నాను, అలాగే ఇక్కడికి వస్తున్న వారి వల్ల ఆనందాన్ని కూడా పొందుతూ చాలా ఎంజాయ్ చేస్తున్నాను. ముఖ్యంగా ఈ షోకి వచ్చిన వారి నుంచి వస్తున్న మన్ననలు నాలో మరింత ఉత్సాహాన్ని నింపుతున్నాయి. దానివల్ల ఇంతా ఉత్సాహంగా ఈ ప్రోగ్రాం చెయ్యగలుగుతున్నానని’ నాగార్జున అన్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు