సినిమా చూసి సంతోషపడుతున్న నాగార్జున !

సినిమా చూసి సంతోషపడుతున్న నాగార్జున !

Published on Jul 25, 2017 7:11 PM IST


అక్కినేని నాగార్జున తన, తన కుమారుల సినిమాల విషయంలో ఈ మధ్య చాలా గట్టిగా వ్యవహరిస్తున్నారు. కథ దగ్గర నుంచి మేకింగ్ వరకు ఎక్కడైనా సినిమా సంతృప్తికరంగా లేకపోతే వెంటనే చేయాల్సిన మార్పులు చేర్పులు చేసేసి అనుకున్న ఔట్ ఫుట్ ను రాబట్టుకుంటూ విజయాల్ని సాధిస్తున్నారు. తాజాగా ఆయన నటించిన ‘రాజుగారి గది-2’ విషయంలో కూడా ఇలానే పక్కాగా ప్లాన్ ప్రకారం టీమ్ ను నడిపించారు నాగ్.

అందుకే ఫైనల్ ప్రోడక్ట్ చాలా బాగా వచ్చిందని, దాన్ని చూసి చాలా సంతోషంగా ఉందని ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఇకపోతే ఈ చిత్రాన్ని అక్టోబర్ 13న భారీ ఎత్తున రిలీజ్ చేయనున్నారు. పివిపి సినిమా, మ్యాటనీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో విజువల్ ఎఫెక్ట్స్ భారీ ఎత్తున ఉండనున్నాయి. ఇకపోతే థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో నాగార్జునకు జోడీగా శీరత్ కపూర్ నటిస్తుండగా అశ్విన్, వెన్నెల కిశోర్ లు పలు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు