మీలో ఎవరు కోటీశ్వరుడు అని ప్రశ్నించనున్న నాగార్జున

మీలో ఎవరు కోటీశ్వరుడు అని ప్రశ్నించనున్న నాగార్జున

Published on Apr 18, 2014 1:02 PM IST

Meelo-Evaru-Koteeswarudu
రెండున్నర దశాబ్దాలు నటించిన తరువాత మొట్టమొదటిసారిగా నాగార్జున బుల్లి తెరపై ఒక క్విజ్ షో ని నిర్వహించనున్నారు. దాని పేరు ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’. ఈ షో జూన్ నుండి మా టివిలో ప్రసారం కానుంది. కౌన్ బనేగా కరోడ్ పతీ తీసిన నిర్వాహకులే ఈ షోని కూడా నిర్వహిస్తున్నారు

ఈరోజు జరిగిన ప్రెస్ మీట్ లో మా టివి చైర్మెన్ నిమ్మగడ్డ ప్రసాద్ మాట్లాడుతూ “క్వాలిటీ షో ల విషయంలో గతకోన్నేళ్ళుగా మా మా టివి ఎప్పుడూ ముందుంది. ఈ రంగంలో మేమే నెంబర్ 1. ఈ షో ని ప్రారంభించే ముందు హోస్ట్ కోసం 37 మండి ప్రముఖులను పరిశీలించి చివరికి కింగ్ నాగ్ ని ఎన్నుకున్నాం. ఆయన ఈ టీం లో మెంబెర్ అయినా మనస్పూర్తిగా నచ్చింది కనుకే ఒప్పుకున్నారు. ప్రతీ అభ్యర్ధితో కనెక్ట్ అయేందుకు నాగార్జునే సరైన వ్యక్తి అనిపించింది” అని అన్నారు

తరువాత నాగార్జున అమల కలిపి స్టేజ్ మీద ప్రశ్నల రూపంలో మనల్ని అలరించారు. ఈ షో ని ఎందుకు ఎన్నుకున్నా అన్నదానికి ఆయన “ప్రతీ ఒక్కరికీ ఒక కల వుంటుంది. దాన్ని సాధించడం కోసం కొంతమంది జీవితాంతం శ్రమిస్తారు. ఈ షో ద్వారా అలాంటి కలలు వున్నారని కలుసుకుని వారి కలల్ని నిజం చేయడం కూడా సమాజ శ్రేయస్కరం అని భావిస్తా ” అని తెలిపాడు

సంబంధిత సమాచారం

తాజా వార్తలు