నాగార్జున చేయనున్న ‘మీలో ఎవరు కోటీశ్వరుడు?’

నాగార్జున చేయనున్న ‘మీలో ఎవరు కోటీశ్వరుడు?’

Published on Apr 18, 2014 1:00 PM IST

Nagarjuna
కింగ్ నాగార్జున హిందీలో సూపర్ హిట్ అయిన బుల్లితెర రియాలిటీ షో ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ తెలుగు వెర్షన్ ద్వారా టాలీవుడ్ బుల్లితెరపై కనిపించానున్నాడని ఇది వరకే తెలియజేశాం. ఈ షో వివరాలను ఇప్పటి వరకూ అనౌన్స్ చేయలేదు. ఆ విషయాలను మేము మీకు ప్రత్యేకంగా అందిస్తున్నాం. గత కొద్ది రోజులుగా మా టీవీలో 100 ప్రశ్నలకు ఒక్క అజవాబు అని ప్రమోట్ చేస్తున్న ఈ ప్రోగ్రాం పేరు ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ అని పెట్టారు. ఈ విషయాన్ని మరి కాసేపట్లో అనౌన్స్ చేయనున్నారు.

నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరించనున్న ఈ షో లో గెలుపొందినవారికి అక్షరాల కోటి రూపాయలు ఇస్తారు. హిందీలో సక్సెస్ అయినట్టే ఇక్కడ కూడా ఈ ప్రోగ్రాం సక్సెస్ అవుతుందని ఆశిస్తున్నారు. ఈ విషయంపై స్పందించిన నాగార్జున ‘ఈ షో కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. ఈ షో అందరిలోనీ బెస్ట్ ద్రామాని క్రియేట్ చేస్తుంది అదికూడా విత్ ఎంటర్టైన్మెంట్ తో అని’ అన్నాడు. జూన్ నుంచి ఈ షో ప్రారంభం కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు