విడుదల తేదీని మార్చుకున్న ‘నక్షత్రం’ !

విడుదల తేదీని మార్చుకున్న ‘నక్షత్రం’ !

Published on Jul 21, 2017 8:00 AM IST


స్టార్ డైరెక్టర్ కృష్ణ వంశీ చేస్తున్న తాజా చిత్రం ‘నక్షత్రం’ పై సినీ వర్గాల్లో, ప్రేక్షకుల్లో ఒక రకమైన క్యూరియాసిటీ ఉంది. పోలీసులు, వాళ్ళ జీవితాలపై రూపొందిన ఈ సినిమా కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అన్ని పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమాను ముందుగా జూలై 28న రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ కొన్ని కారణాల వలన ఇప్పుడు ఆగష్టు 4 కు వాయిదా వేశారు.

ఆగష్టు 4న మరో పెద్ద సినిమా విడుదల లేకపోవడంతో ఈ వాయిదా సినిమాకు కలిసొచ్చే అవకాశముంది. సందీప్ కిషన్, రెజినాలు హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో ధరమ్ తేజ్, ప్రగ్య జైస్వాల్ లు అతిధి పాత్రల్లో కనిపించనున్నారు. కె. శ్రీనివాసులు నిర్మిస్తున్న ఈ సినిమాకి భీమ్స్, భరత్ మధుసూదన్, హరి గౌరాలు సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు