ఫాన్స్ తో ‘ఆగడు’ చూడనున్న నమ్రత

ఫాన్స్ తో ‘ఆగడు’ చూడనున్న నమ్రత

Published on Sep 19, 2014 5:45 AM IST

namaratha

అభిమానుల కోలాహలం మధ్య సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘ఆగడు’ సినిమాను చూడనున్నారు మహేష్ వైఫ్ నమ్రత. మాకు అందిన సమాచారం ప్రకారం హైదరాబాద్ లో ప్రముఖ మల్టీప్లెక్స్ థియేటర్ లో మార్నింగ్ షోకి హాజరవుతున్నారు. ఆల్రెడీ ‘ఆగడు’ మేనియాతో అభిమానులు ఊగిపోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా 2000 ధియేటర్లలో విడుదలవుతున్న ఈ సినిమా ఒక్క హైదరాబాద్ లోనే దాదాపు 90 థియేటర్ లలో రిలీజ్ చేస్తున్నారు. మల్టీప్లెక్స్ థియేటర్లు అదనం.

‘దూకుడు’ తర్వాత మహేష్ బాబు, శ్రీను వైట్ల కలయికలో రూపొందిన ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటించింది. శృతి హాసన్ జంక్షన్ లో… అనే ప్రత్యేక గీతంలో సందడి చేసింది. రాజేంద్ర ప్రసాద్, నాజర్, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్ తదితరులు ఇతర పాత్రలలో నటించారు. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ ఈ సినిమాను నిర్మించింది. తమన్ సంగీత దర్శకుడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు