మొదటి షెడ్యూల్ ముగించుకున్న నాని, నాగార్జునల చిత్రం !

మొదటి షెడ్యూల్ ముగించుకున్న నాని, నాగార్జునల చిత్రం !

Published on Mar 28, 2018 8:40 AM IST

సీనియర్ స్టార్ హీరో నాగార్జున, నానిలు కలిసి నటిస్తున్న మల్టీ స్టారర్ చిత్రం యొక్క షూటింగ్ ఉగాది రోజున మొదలైన సంగతి తెలిసిందే. ఖచ్చితమైన ప్లానింగ్ తో చిత్రీకరణ మొదలుపెట్టిన దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య చాలా త్వరగా మొదటి షెడ్యూల్ ముగించేశారు.

ఈ మొదటి షెడ్యూల్లో హైదరాబాద్లోని మియాపూర్ మెట్రో స్టేషన్లో నాని, రష్మిక మందన్న, సంపూర్ణేష్ బాబుల మీద కొన్ని కీలక సన్నివేశాలని చిత్రీకరించారు. వైజయంతి మూవీస్ పతాకంపై అశ్వినీ దత్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు