కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న ‘ఆచారి అమెరికా యాత్ర’ !

కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న ‘ఆచారి అమెరికా యాత్ర’ !

Published on Mar 17, 2018 10:56 AM IST

మంచు హీరో విష్ణు నటించిన తాజా చిత్రం ‘ఆచారి అమెరికా యాత్ర’. జి.నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం జనవరి నెలలోనే విడుదల కావాల్సి ఉండగా అనివార్య కారణాల వలన వాయిదాపడుతూ వచ్చింది. తాజా సమాచారం మేరకు నిర్మాతలు ఏప్రిల్ 5వ తేదీన సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నారట.

త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడ చేయనున్నారు. గతంలో నాగేశ్వర్ రెడ్డి విష్ణుతో చేసిన ‘ఈడో రకం ఆడో రకం’ మంచి విజయాన్ని అందుకొని ఉండటంతో ఈ చిత్రంపై అంచనాలు పెరిగాయి. పద్మజ పిక్చర్స్ బ్యానర్ పై కీర్తి చౌదరి, కిత్తులు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో విష్ణు సరసన ప్రగ్య జైస్వాల్ హీరోయిన్ గా మెరవనుంది. విష్ణుతో పాటు బ్రహ్మాండం కూడ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు