కొత్త విడుదల తేదీని ఫిక్స్ చేసుకున్న సాయి పల్లవి సినిమా !

కొత్త విడుదల తేదీని ఫిక్స్ చేసుకున్న సాయి పల్లవి సినిమా !

Published on Apr 21, 2018 3:32 PM IST

‘ఫిదా, మిడిల్ క్లాస్ అబ్బాయి’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన నటి సాయి పల్లవి. ఈమె నటించిన తమిళ చిత్రం ‘కారు’. యంగ్ హీరో నాగ శౌర్య కూడ నటించిన ఈ సినిమాను తెలుగులో ‘కణం’ పేరుతో విడుదలచేయనున్నారు. కానీ వివిధ కారణాల వలన అనేకసార్లు వాయిదాపడిన ఈ సినిమా మరొక కొత్త విడుదల తేదీని ఫిక్స్ చేసుకుంది.

ఏప్రిల్ 27న ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రం యొక్క తెలుగు హక్కుల్ని ఎన్వీఆర్ సినిమా అధినేత ఎన్వీ ప్రసాద్ ఫ్యాన్సీ రేటుకి కొనుగోలుచేశారు. తమిళ దర్శకుడు ఏ.ఎల్ విజయ్ డైరెక్ట్ చేసిన ఈ ద్విభాషా చిత్రం హర్రర్ థ్రిల్లర్ గా ఉండనుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు