హోళీ కన్ఫ్యూజన్ ని అడ్వాంటేజ్ గా మార్చుకున్న నిఖిల్

హోళీ కన్ఫ్యూజన్ ని అడ్వాంటేజ్ గా మార్చుకున్న నిఖిల్

Published on Mar 5, 2015 8:25 AM IST

surya-vs-surya
‘స్వామి రారా’, ‘కార్తికేయ’ లాంటి డిఫరెంట్ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించి బాక్స్ ఆఫీసు వద్ద హిట్స్ అందుకున్న హీరో నిఖిల్. మరోసారి నిఖిల్ సరికొత్త కథాంశంతో చేసిన సినిమా ‘సూర్య vs సూర్య’. ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు రానుంది. మామూలుగా శుక్రవారం రావాల్సిన సినిమా గురువారమే వస్తోంది. దానికి కారణం గవర్నమెంట్ హాలిడే అయిన హోళీ పండుగలో చిన్న కన్ఫ్యూజన్ రావడం. దీన్ని నిఖిల్ అడ్వాంటేజ్ గా తీసుకున్నాడు.

ఈ సినిమాని గురువారం రిలీజ్ చెయ్యడానికి గల కారణం ఏంటని నిఖిల్ ని అడిగితే ‘కొన్ని చోట్ల హోళీకి ఈ రోజు సెలవు ఇస్తే, మరికొందరు రేపు ఇచ్చారు. ఈ కన్ఫ్యూజన్ మా సినిమాకి బాక్స్ ఆఫీసు వద్ద హెల్ప్ అవుతుందని, లాంగ్ వీకెండ్ కి సహకరిస్తుందని మార్చి 5నే ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నామని’ తెలిపాడు. మరి ఈ హోళీ కన్ఫ్యూజన్ సినిమాకి ఎంతవరకూ హెల్ప్ అవుతుందనేది మరి కొద్దిసేపట్లో తెలిసిపోతుంది.

నిఖిల్ సరసన త్రిదా చౌదరి హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ద్వారా సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. బేబీ త్రిష సమర్పణలో సురక్షా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై శివ కుమార్ నిర్మించిన ఈ సినిమాలో మధుబాల, తనికెళ్ళ భరణి, సత్య కీలక పాత్రలలో నటించారు. ‘కార్తికేయ’ దర్శకుడు చందు మొండేటి డైలాగ్స్ అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు