కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ప్రస్తుతం ‘గాయత్రి’ చిత్రం లో నటించనున్నాడు. రెండేళ్ల విరామం తర్వాత అతడు నటిస్తున్న మూవీ ఇది. లక్ష్మి ప్రసన్న బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది. మదన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. డైమండ్ రత్నబాబు ఈ సినిమాకు కథ మాటలు అందిస్తున్నారు.
ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ను సంక్రాంతి కి విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు చిత్ర యూనిట్. ‘మేడమీద అబ్బాయి’ హీరోయిన్ నిఖిల విమల్ ఈ సినిమాలో మోహన్ బాబుకు కూతురిగా నటిస్తుంది. ఈ సినిమా ప్రధానంగా తండ్రి కూతురు మద్య నడిచే కథగా తెలుస్తుంది. మోహన్ బాబు ఈ సినిమాతో మంచి విజయం సాదించి కమ్ బ్యాక్ అవుతాడని ఆశిద్దాం.