‘అవును 2’ తో రీ ఎంట్రీ ఇస్తున్న నికిత

‘అవును 2’ తో రీ ఎంట్రీ ఇస్తున్న నికిత

Published on Sep 1, 2014 3:36 PM IST

nikitha
హర్షవర్ధన్ రాణే, పూర్ణ జంటగా విభిన్న చిత్రాల దర్శకుడు రవిబాబు డైరెక్ట్ చేసినచిత్రం ‘అవును’. 2012లో విడుదలైన సక్సెస్ అందుకున్న ఈ సినిమాకి సీక్వెల్ గా రూపొందుతున్న ‘అవును 2’ సినిమా ప్రస్తుతం సెట్స్ పై ఉంది. మొదటి పార్ట్ లో నటించిన హర్షవర్ధన్ రాణే, పూర్ణలతో పాటు సంజన ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్లు ఇస్ది వరకు తెలిపాము.

తాజాగా ఈ సినిమాలో మరో కథానాయిక వచ్చి చేరింది. తనే నికిత. గతంలో చింతకాయల రవి, అనసూయ మొదలైన సినిమాల్లో నటించిన ఈ భామ గత 6 సంవత్సరాలుగా తెలుగులో సినిమా చేయలేదు. ఈ సినిమాలోని ఓ ముఖ్య పాత్ర కోసం రవిబాబు నికితని అప్రోచ్ అవ్వగానే తనకి పాత్ర బాగా నచ్చడంతో వెంటనే ఓకే చేసింది. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి చాలా గ్యాప్ ఇచ్చిన నికిత ‘అవును 2’ రీ ఎంట్రీ ఇచ్చి తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.

ఫ్లయింగ్‌ ఫ్రాగ్స్‌, సురేష్ ప్రొడక్షన్స్‌ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. చాలా లో బడ్జెట్ తో తెరకెక్కిన అవును సినిమా నిర్మాతలకి మంచి లాభాన్ని తెచ్చి పెట్టాయి. ఆ సినిమా లానే ఈ సినిమా కూడా హిట్ అయ్యి మంచి లాభాలను తెచ్చి పెతుతుందని ఈ చిత్ర ప్రొడక్షన్ టీం భావిస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు