ట్రైలర్ తో ఆకట్టుకుంటున్న అనుష్క ‘నిశ్శబ్దం’ !

ట్రైలర్ తో ఆకట్టుకుంటున్న అనుష్క ‘నిశ్శబ్దం’ !

Published on Sep 21, 2020 1:55 PM IST

హేమంత్ మధుకర్ దర్శకత్వంలో అనుష్క ప్రధాన పాత్రలో రాబోతున్న సస్పెన్స్ థ్రిల్లర్ ‘నిశ్శబ్దం’. కాగా తాజాగా ఈ సినిమా నుండి ట్రైలర్ ను రిలీజ్ చేసింది చిత్రబృందం. ట్రైలర్ లో ఇంట్రస్టింగ్ ఎలిమెంట్స్ తో పాటు బ్యూటిఫుల్ విజువల్స్, మరియు అనుష్క, మాధవన్ ల మధ్య రిలేషన్ అలాగే మిగిలిన క్యారెక్టర్స్ యొక్క యాక్టివిటీస్ అండ్ హారర్ ఎఫెక్ట్స్ ను బాగా ఎస్టాబ్లిష్మెంట్స్ చేశారు. ట్రైలర్ లో నేపథ్య సంగీతం కూడా చాల బాగుంది, ట్రైలర్ చూస్తుంటే సినిమాలో సప్సెన్స్ ఎలిమెంట్స్ సినిమాకే హైలెట్ గా నిలుస్తాయని అనిపిస్తోంది. మొత్తానికి ఈ ట్రైలర్ నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది. షాలిని పాండే క్యారెక్టర్ కూడా సినిమాలో కీలకంగా ఉండేలా ఉంది.

కాగా ఈ సినిమాలో అనుష్క ఆర్ట్ లవర్ గా కనిపించనుంది. ఇక మాధవన్ ఈ సినిమాలో సెల్లో ప్లేయర్ గా నటించనున్నాడు. ఇక ఈ చిత్రంలో అనుష్క, మాధవన్ లతో పాటు సుబ్బరాజు, అంజలి, షాలిని పాండే తో పాటు ప్రముఖ హాలీవుడ్ నటుడు మైఖేల్ మాడిసన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ‘భాగమతి’గా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అందుకున్న అనుష్క.. మరి ఈ సినిమాతో కూడా సూపర్ హిట్ అందుకుంటుందేమో చూడాలి. రచయిత కోన వెంకట్ తన బ్యానర్‌ లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అక్టోబర్ 2న అమెజాన్ ప్రైమ్ లో గ్రాండ్ గా ఈ సినిమా రిలీజ్ కాబోతోంది.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు