ఆ నిర్మాతలతోనే మరో సినిమా చేయనున్న నితిన్ !

ఆ నిర్మాతలతోనే మరో సినిమా చేయనున్న నితిన్ !

Published on Jan 23, 2018 1:41 PM IST

నితిన్ ప్రస్తుతం కృష్ణ చైతన్య దర్శకత్వంలో ‘గుర్తుందా శీతాకాలం’ సినిమాలో నటిస్తున్నాడు. మేఘా ఆకాష్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్స్ జరుపుకుంటోంది. ఈ సినిమా తరువాత నితిన్ ‘శ్రీనివాస కళ్యాణం’ సినిమాలో నటిస్తున్నాడు. ‘శతమానం భవతి ‘సినిమాతో మంచి విజయం సాధించిన సతీష్ వేగ్నేష్ దర్శకత్వం వహిస్తుండగా దిల్ రాజు నిర్మిస్తున్నాడు. పూజా హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్.

ఈ సినిమా తరువాత నితిన్ 14 రీల్స్ సంస్థలో సినిమా చెయ్యబోతున్నాడు. ‘లై’ సినిమా ఆశించిన విజయం సాధించని కారణంగా ఈ హీరో 14 రీల్స్ నిర్మాతలతో సినిమా చేసేందుకు అంగీకరించాడని సమాచారం. ఈ సినిమాకు దర్శకుడు ఎవరనేది త్వరలో తెలియబోతోంది. ప్రస్తుతం ఈ నిర్మాతలు నితిన్ కోసం కథలు వింటున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్ పై స్పష్టమైన వార్త మరికోన్నిరోజుల్లో రానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు