మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘ధృవ’ సినిమాతో థియేటర్లలో సందడి చేసేందుకు అంతా సిద్ధమైపోయింది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై మెగా అభిమానులంతా భారీ ఆశలే పెట్టుకున్నారు. టీజర్, ట్రైలర్ అన్నీ సినిమాకు పాజిటివ్ హైప్నే తీసుకురావడంతో సక్సెస్పై అంతా ధీమాగా ఉన్నారు. ఇక సాధారణంగా ఏ పెద్ద హీరో సినిమాకైనా తెలుగులో బెనిఫిట్ షోస్ నిర్వహించడం అన్నది సాధారణంగా జరుగుతూ వస్తోంది. అయితే ‘ధృవ’కు మాత్రం బెనిఫిట్ షోస్ పెట్టడం లేదట.
కారణాలేవైనా ‘ధృవ’కు ప్రస్తుతానికైతే ఏ బెనిఫిట్ షో ఖరారు కాలేదు. దీంతో అభిమానులంతా తమ హీరోను తెరపై చూడడానికి రేపు ఉదయం ఆట వరకూ ఎదురుచూడాల్సిందే. ఇదిలా ఉంటే అమెరికాలో మాత్రం తెల్లవారుజాము నుంచే (భారత కాలమానం) ప్రీమియర్స్ సందడి మొదలవుతోంది. రామ్ చరణ్ స్వయంగా హాజరు కానుండడంతో యూఎస్ ప్రీమియర్స్కు మరింత క్రేజ్ వస్తోంది. ఇండియాలో మాత్రం చరణ్ అభిమానులు బెనిఫిట్ షోస్ లేవని కాస్త నిరుత్సాహపడ్డారు. లేటైనా రేపు ఉదయం ఆటనుండి హిట్ టాక్తో తమ పండగ మొదలవుతుందని సర్దిచెప్పుకుంటున్నారు. గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మించిన ఈ సినిమాలో రకుల్ ప్రీత్ హీరోయిన్గా నటించగా, అరవింద్ స్వామి విలన్గా నటించారు.