నాగార్జున – కార్తీలు హీరోలుగా ఓ భారీ మల్టీ స్టారర్ రూపొందుతోన్న విషయం తెలిసిందే. పీవీపీ సంస్థ నిర్మిస్తోన్న ఈ సినిమాలో నటించేందుకు హీరోయిన్ శృతిహాసన్ ఒప్పుకొని, చివరి విషయంలో తప్పుకోవడం వివాదానికి తెర తీసింది. ఈ క్రేజీ మల్టీస్టారర్కు డేట్స్ ఇచ్చిన శృతిహాసన్, సినిమాలో నటించేందుకు గానూ అడ్వాన్స్ కూడా తీసుకొని చివర్లో సినిమా నుంచి తప్పుకుంది. ఈ విషయం కోర్టు దాకా వెళ్ళడంతో శృతి హాసన్, తరువాతి ఉత్తర్వులు వచ్చేవరకూ వేరే ఇతర సినిమాలను ఒప్పుకోకూడని పరిస్థితి నెలకొంది.
ఇదిలా ఉంటే.. మార్చి 15న ప్రారంభమైన ఈ సినిమా, వివాదాలతో సంబంధం లేకుండా షూటింగ్ పూర్తి చేసుకుంటోంది. ఇప్పటికే మొదటి షెడ్యూల్ దాదాపుగా పూర్తి అయినట్టు సమాచారం. ఏప్రిల్ మొదటి వారంలో రెండో షెడ్యూల్ మొదలు కానుంది. తెలుగు, తమిళ భాషల్లో నిర్మితమౌతోన్న ఈ భారీ బడ్జెట్ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకుడు.