ప్రముఖ నిర్మాత చేతికి కార్తీ ‘ఖైదీ’ !

ప్రముఖ నిర్మాత చేతికి కార్తీ ‘ఖైదీ’ !

Published on Oct 15, 2019 11:03 AM IST

లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో కార్తీ చేస్తున్న ప్రయోగాత్మక చిత్రం ‘ఖైదీ’. నిన్న విడుదల అయిన ఈ మూవీ తెలుగు ట్రైలర్ సస్పెన్సు అండ్ యాక్షన్ తో సాగుతూ సినిమా పై అంచనాలను పెంచేసింది. కాగా ఈ సినిమా తెలుగు రైట్స్ ను శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అధినేత కె.కె. రాధామోహన్ సొంతం చేసుకున్నారు. తెలుగులో ఈ చిత్రాన్ని దీపావళి పండుగ సందర్భంగా అక్టోబర్ 26 న భారీ స్థాయిలో విడుదల చేయాలని కె.కె. రాధామోహన్ ప్లాన్ చేస్తున్నారు .

ఇక అవుట్ ఆండ్ అవుట్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్ లేదు. డ్రీం వారియర్ పిక్చర్స్ పతాకం ఫై ఎస్ ఆర్ ప్రభు నిర్మిస్తున్న ఈ చిత్రానికి సామ్ సీఎస్ సంగీతం అందిస్తున్నాడు. మరి ఈ డిఫరెంట్ చిత్రాన్ని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. ఇక కార్తి ఈ సినిమాతో దృశ్యం ఫేమ్ జీతూ జోసెఫ్ డైరెక్షన్ లో కూడా ఓ సినిమా చేస్తున్నాడు. మొత్తానికి మంచి హిట్ కోసం ఎదురుచూస్తోన్న కార్తికి ఈ సినిమా ఏ రేంజ్ హిట్ ఇస్తోందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు