‘ఓ పిట్ట క‌థ’కి సెన్సార్ పూర్తయింది !

‘ఓ పిట్ట క‌థ’కి సెన్సార్ పూర్తయింది !

Published on Feb 26, 2020 6:54 PM IST

భ‌వ్య క్రియేష‌న్స్ ప్రస్తుతం ‘ఓ పిట్ట క‌థ’ అనే కాన్సెప్ట్ మూవీని రూపొందిస్తున్న సంగ‌తి తెలిసిందే. చెందు ముద్దు ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. అయితే తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంది. ‘U’ సర్టిఫైతో ప్రపంచ వ్యాప్తంగా మార్చి 6న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావ్వడానికి సన్నధం అవుతుంది.

కాగా లవ్ స్టోరీతో పాటు సప్సెన్స్ ఎలిమెంట్స్ కూడా ఈ సినిమాలో బాగుంటాయని తెలుస్తోంది. వి.ఆనందప్రసాద్‌ నిర్మిస్తోన్న ఈ చిత్రంలో విశ్వంత్‌ దుద్దుంపూడి, సంజ‌య్ రావు, నిత్యాశెట్టి, బ్రహ్మాజీ, బాలరాజు, శ్రీనివాస్‌ భోగిరెడ్డి, భద్రాజీ, రమణ చల్కపల్లి, సిరిశ్రీ, సూర్య ఆకొండి తదితరులు నటిస్తున్నారు. ఇక ఈ చిత్రం ఒక విలేజ్‌లో జ‌రిగే స్టోరీ నేప‌థ్యంలో న‌డుస్తుందని… ప్ర‌తి స‌న్నివేశం స్వ‌చ్ఛంగా సాగుతూనే క‌డుపుబ్బ న‌వ్విస్తుందని చెబుతుంది చిత్రబృందం. మ‌రోవైపు ఏం జ‌రుగుతోంద‌నే ఉత్కంఠ‌ను రేకెత్తిస్తుందట. ప‌తాక స‌న్నివేశాల వ‌ర‌కూ ఆ థ్రిల్లింగ్ అలాగే స‌స్టైన్ అవుతుందట.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు