ఒకరి ప్రాణాన్ని బలితీసుకున్న ‘ఓకే కన్మణి’

ఒకరి ప్రాణాన్ని బలితీసుకున్న ‘ఓకే కన్మణి’

Published on Apr 21, 2015 1:20 PM IST

Ok-Kanmani
స్టార్ డైరెక్టర్ మణిరత్నం చాలా తర్వాత రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘ఓకే కన్మణి’ సినిమాతో హిట్ అందుకొని విజయాన్ని ఆస్వాదిస్తున్నాడు. ఒకేసారి తెలుగు తమిళ భాషల్లో రిలీజ్ అయిన ఈ సినిమాకి రెండు ప్రాంతాల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా తమిళ నాడులో ఈ క్లాసీ లవ్ స్టొరీకి రెస్పాన్స్ సూపర్బ్ గా ఉంది. కలెక్షన్స్ కూడా అదరగొడుతోంది. కానీ ఇన్ని శుభాల మధ్య ఆదివారం సాయంత్రం కోయంబత్తూరులో ఓ విషాదకరమైన సంఘటన చోటుచేసుకొని అందరినీ షాక్ కి గురిచేసింది.

కోయంబత్తూరుకి చెందిన ఓ 29 ఏళ్ళ కుర్రాడు జె. జైశంకర్ తన గర్ల్ ఫ్రెండ్ మణిరత్నం తీసిన రొమాంటిక్ ఎంటర్టైనర్ ఓకే కన్మణి సినిమాకి రాననడంతో అతను ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. గర్ల్ ఫ్రెండ్ సినిమాకి రాకపోతే కూడా ఇలా ప్రాణాలు తీసుకోవడం అందరినీ అవాక్కయ్యేలా చేసింది. ప్రస్తుతం పోలీసులు ఈ కేసును రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. దల్కేర్ సల్మాన్ – నిత్యా మీనన్ జంటగా నటించిన ఈ సినిమాకి ఎ ఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించాడు. తెలుగులో ప్రముఖ నిర్మాత దిల్ రాజు ‘ఓకే బంగారం’ పేరుతో ఈ సినిమాని రిలీజ్ చేసారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు