మరో ట్రైలర్ తో సిద్దమవుతున్న మంచు మనోజ్ !

మరో ట్రైలర్ తో సిద్దమవుతున్న మంచు మనోజ్ !

Published on Oct 30, 2017 9:15 AM IST


గత కొన్నాళ్ళుగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న యంగ్ హీరో మంచు మనోజ్ ‘ఒక్కడు మిగిలాడు’ అనే చిత్రంతో త్వరలోనే మన ముందుకురానున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా తాలూకు టీజర్, ట్రైలర్లు మంచి ఆదరణ దక్కించుకోవడంతో పాటు సినిమాపై బోలెడంత క్రేజ్ ను క్రియేట్ చేశాయి. దీంతో చిత్ర టీమ్ నిన్ననే ఒక పాటను రిలీజ్ చేసి త్వరలోనే రెండవ ట్రైలర్ ను విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది.

నవంబర్ 1 ఉదయం 9 గంటలకు రిలీజ్ కానున్న ఈ ట్రైలర్ కూడా మొదటి ట్రైలర్ లాగనే మంచి ఇంటెన్సిటీతో, భావోద్వేగాలతో నిండి ఉంటుందని మనోజ్ తెలిపారు. అజయ్ అండ్రూస్ నూతక్కి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో మనోజ్ ఎల్టీటీవీ చీఫ్ ప్రభాకరన్ పాత్రలోనూ, స్టూడెంట్ లీడర్ పాత్రలోను కనిపించనున్నాడు. ఎస్.ఎన్ రెడ్డి, లక్ష్మి కాంత్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని నవంబర్ 10న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు