తాజ్ మహల్ బ్యాక్ డ్రాప్ లో ఒక్కడు రీమేక్

తాజ్ మహల్ బ్యాక్ డ్రాప్ లో ఒక్కడు రీమేక్

Published on Oct 22, 2014 1:43 AM IST

Arjun-kapoor
టాలీవుడ్ లో ‘ఒక్కడు’ సినిమా భారీ విజయం సాధించింది. మహేష్ కెరీర్ లో ఒక బెస్ట్ మూవీగా ఈ సినిమా నిలిచింది. ఈ సినిమాను ప్రత్యేకంగా నిర్మించిన చార్మినార్ సెట్ లో తెరకెక్కించారు. ఆ సెట్ సైతం సినిమా విజయంలో కీలకపాత్రపోషించింది. ఇప్పుడు ఈ సినిమా హిందీలో అర్జున్ కపూర్ ‘తేవర్’ గా మనముందుకు రానున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన మోషన్ పోస్టర్ ని విడుదలచేసారు. ఆ వీడియోని పరిశీలిస్తే బాలీవుడ్ లో చార్మినార్ కి బదులుగా తాజ్ మహల్ ని వాడినట్లు తెలుస్తుంది

అయితే ఈ సినిమాను నిజంగానే తాజ్ మహల్ లో తెరకెక్కించారా లేక సెట్ లో షూట్ చేసారా అన్నది తెలియాల్సివుంది. ఈ చిత్రంలో ఒక ఐటెంసాంగ్ లో శృతిహాసన్ నటించింది. జనవరిలో ఈ చిత్రం విడుదలకానుంది

సంబంధిత సమాచారం

తాజా వార్తలు