సరిలేరు నీకెవ్వరూ నుండి సూపర్ అప్డేట్

సరిలేరు నీకెవ్వరూ నుండి సూపర్ అప్డేట్

Published on Oct 21, 2019 9:38 AM IST

ఈ ఏడాది సంక్రాంతి పుంజుగా బరిలో దిగుతున్నాడు మహేష్. ఆయన నటిస్తున్న తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరూ వచ్చే ఏడాది జనవరి 12న విడుదల కానుంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ పూర్తి కావడానికి ఇంకా కేవలం ఒక షెడ్యూల్ మాత్రమే మిగిలివుందట. ఆ షెడ్యూలు కూడా పూర్తయితే సరిలేరు నీకెవ్వరూ టాకీ పార్ట్ మొత్తం పూర్తవుతుందని సమాచారం. కాగా లేటెస్ట్ షెడ్యూల్ నందు విలన్ ఇంట్లో నడిచే కొన్ని సీరియస్ సన్నివేశాలు పూర్తి చేశారట చిత్ర బృందం.

ఈ విషయాన్ని దర్శకుడు అని రావిపూడి స్వయంగా ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. రాయలసీమ నేపథ్యంలో ఫ్యాక్షన్ ఛాయలు ఈ మూవీలో ఉంటాయి తెలుస్తుంది. కర్నూల్ నందు గల ఫేమస్ కొండారెడ్డి బురుజు సెంటర్ సెట్ లో కొన్ని కీలకపోరాట సన్నివేశాలు ఇప్పటికే తెరకెక్కించడం జరిగింది. ఇక రష్మిక మందాన మహేష్ కి జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో లేడీ సూపర్ స్టార్ విజయ శాంతి కీలక పాత్ర చేస్తున్నారు. దేవిశ్రీ సంగీతం అందిస్తుండగా దిల్ రాజు, అనిల్ సుంకర, మహేష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు