‘బాహుబలి’కి మొదలైన కీరవాణి ఆర్కెస్ట్రా.!

‘బాహుబలి’కి మొదలైన కీరవాణి ఆర్కెస్ట్రా.!

Published on Mar 2, 2015 4:51 PM IST

keervani-archestra
టాలీవుడ్ సూపర్ సక్సెస్ఫుల్ క్రేజీ డైరెక్టర్ ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘బాహుబలి’. ఈ సినిమాని రెండు పార్ట్స్ గా రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే మొదటి పార్ట్ కి సంబందించిన టాకీ పార్ట్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమాలోని చివరి రెండు పాటలని ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో షూట్ చేస్తున్నారు. మరో వైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఎంఎం కీరవాణి కూడా తన వర్క్ ని వేగవంతం చేసారు.

బాహుబలి నేపధ్య సంగీతంలో కీలక పాత్ర పోషించే ఆర్కెస్ట్రా రికార్డింగ్ సెషన్ ని ఈ రోజు ప్రసాద్ లాబ్స్ లో మొదలు పెట్టారు. ఎంఎం కీరవాణి పర్యవేక్షణలో ఈ ఆర్కెస్ట్రా రికార్డింగ్స్ జరుగుతున్నాయి. సాంగ్ శ్సూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను కూడా ఏప్రిల్ చివరికల్లా ఫినిష్ చేసి మే లో బాహుబలి ఫస్ట్ పార్ట్ ని రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో సుధీప్, రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్ తదితరులు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఆర్కా మీడియా వారు అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాని ఒకేసారి తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు