‘బాహుబలి’లో.. ‘ఆస్కార్’ నామినీ సింగర్ పాట!

‘బాహుబలి’లో.. ‘ఆస్కార్’ నామినీ సింగర్ పాట!

Published on Apr 1, 2015 6:45 PM IST

Baahubali-Singers
దర్శకుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న ‘బాహుబలి’ విషయంలో అన్నీ పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. సినిమాను అన్ని విధాలుగా ది బెస్ట్ సినిమాగా నిలిపేందుకు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. తాజాగా సినిమాలోని ఓ కీలక పాటను ప్రఖ్యాత గాయకురాలు బాంబే జయశ్రీతో పాడించారు. బ్లాక్‌బస్టర్ హాలీవుడ్ సినిమా ‘లైఫ్ ఆఫ్ పై’ లోని ఓ పాటకు బాంబే జయశ్రీ ఆస్కార్‌కు నామినేట్ అయ్యారు. అంతటి ప్రముఖ సింగర్ బాహుబలిలో ఓ పాట పాడడం విశేషంగా కనిపిస్తోంది.

సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి ఆధ్వర్యంలో ఈ పాటకు సంబంధించిన రికార్డింగ్‍ కూడా ఇప్పటికే పూర్తైంది. ఇక ఇదే సినిమాలో మరో ప్రముఖ సింగర్ ఖైలాష్ ఖేర్ ఓ పాట పాడిన విషయం తెలిసిందే. విజువల్ పరంగానే కాక, మ్యూజికల్‌గానూ బాహుబలి వండర్ అనిపించుకుంటుందని టాక్. ఇప్పటికే దాదాపుగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను మే 15న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు