అక్టోబర్ 2న రానున్న ‘పాఠశాల’

అక్టోబర్ 2న రానున్న ‘పాఠశాల’

Published on Jul 30, 2014 8:05 PM IST

Patasala

‘వినాయకుడు’ ‘విలేజ్ లో వినాయకుడు’, ‘కుదిరితే కప్పు కాఫీ’ సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమున్న మహి దర్శకుడిగా పరిచయమవుతూ చేసిన సినిమా ‘పాఠశాల’. ఈ సినిమా ట్రైలర్ ని ఇటీవలే అధికారికంగా లాంచ్ చేసారు. ఈ ట్రైలర్ కి యువత నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. తాజాగా ఈ సినిమాని అక్టోబర్ 2న రిలీజ్ చేయనున్నట్లు ఈ చిత్ర టీం తెలియజేసింది.

నూతన నటీనటుల నటన, ఫ్రెష్ కాన్సెప్ట్, ఫీల్ గుడ్ మ్యూజిక్ ఈ సినిమాకి ప్రధాన హైలైట్ అవుతుందని ఈ చిత్ర టీం అంటోంది. ఇంజనీరింగ్ పూర్తి చేసుకున్న ఓ ఐదుగురు ఫ్రెండ్స్ ప్రయాణమే ఈ సినిమా. ట్రైలర్లో వచ్చే వన్ లైన్ డైలాగ్స్ కూడా అందరినీ ఆకట్టుకుంటున్నాయి. హిందీలో వచ్చిన దిల్ చాహతా హై, జిందగీ నా మిలేగా దోబారా లాగా రోడ్ జర్నీ సినిమా తెలుగులో రావడం ఇదే ప్రధమం అని చెప్పుకోవాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు