క్లీన్ ‘యు’ సర్టిఫికేట్ పొందిన ‘పాఠశాల’.

క్లీన్ ‘యు’ సర్టిఫికేట్ పొందిన ‘పాఠశాల’.

Published on Aug 22, 2014 6:30 PM IST

pathasala-imge
నందు, శశాంక్, సాయి రోనాక్, హమ్ ద్, అనుప్రియ, శిరీష నటీనటులుగా ఎ మూన్ వాటర్ పిక్చర్స్ పతాకంపై తెరకెక్కించిన చిత్రం ‘పాఠశాల’.
ఈ సినిమా నేడు సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు ‘పాఠశాల’కు క్లీన్ ‘యు’ సర్టిఫికేట్ ఇష్యూ చేశారు. అక్టోబర్ 2వ తేదిన ప్రేక్షకుల ముందుకు వస్తున్న ‘పాఠశాల’ 40 రోజుల ముందు సెన్సార్ పూర్తి చేసుకోవడం విశేషం. ఈ సినిమా ద్వారా మహి వి.రాఘవ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మహంకాళి రాకేష్, పవన్ కుమార్ రెడ్డి నిర్మాతలు.

ఐదుగురు స్నేహితులు తమ ప్రయాణంలో ఎటువంటి పాఠాలు నేర్చుకున్నారనే అంశంతో ఈ సినిమాను తెరకెక్కించారు దర్శకుడు. తెలుగులో వస్తున్న మొదటి రోడ్ జర్నీ సినిమాగా ‘పాఠశాల’ను అభివర్ణించవచ్చు. నటీనటుల పెర్ఫార్మన్స్, ఫ్రెష్ కాన్సెప్ట్, ఫీల్ గుడ్ మ్యూజిక్ ఈ సినిమాకి మేజర్ హైలైట్స్ అని సినిమా యూనిట్ వర్గాలు చెప్తున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు