పవన్ చిరుసాయం…!

పవన్ చిరుసాయం…!

Published on May 31, 2016 9:20 AM IST

pawan-kalyan
తెలుగు సాహిత్యంలో అరుదైన పుస్తకంగా పేరుపొందిన ’ఆధునిక మహాభారతం’ ని ప్రముఖ కవి గుంటూరు శేశేంద్ర శర్మ రచించారు. ఈ పుస్తకాన్ని ఓ సెకండ్ హ్యాండ్ బుక్ షాపులో చూసిన ప్రముఖ దర్శకుడు తివిక్రమ్ శ్రీనివాస్ కొని చదివాడు. ఈ పుస్తకం గురించి పవన్ కళ్యాణ్ దగ్గర గొప్పగా ప్రస్తావించగా పవన్ కళ్యాణ్ ఆ పుస్తకం తివిక్రమ్ దగ్గర నుంచి తీసుకుని చదివాడట. ఆ పుస్తకం బాగా నచ్చటంతో పుస్తకం గురించి విచారించగా మార్కెట్ ఆ పుస్తకం దొరకటం లేదని తెలిసింది.

వెంటనే పవన్ కళ్యాణ్ గుంటూరు శేశేంద్ర శర్మ కుమారుడిని కలిసి ఆ పుస్తకం పునర్ముద్రించమని చెప్పడంతో పాటు 25000 వేల పుస్తకాల ముద్రణకు అవసరం అయ్యే ఆర్థికసాయం చేశాడు. ఇక త్వరలో గుంటూరు శేశేంద్ర శర్మ ’ఆధునిక మహాభారతం’ మార్కెట్ లో కనిపించనుంది. తెలుగు సాహిత్యంలో అరుదైన పుస్తకంగా పేరుపొందిన ఈ పుస్తకం మరోసారి పవన్ చేతుల మీదుగా మార్కెట్ లోకి రావడం ఎంతైనా సంతోషం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు