యాక్షన్ సీక్వెన్స్ షూట్ లో పవన్ !

యాక్షన్ సీక్వెన్స్ షూట్ లో పవన్ !

Published on Mar 1, 2021 7:00 AM IST

పవన్ – క్రిష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా పవన్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ మూవీ అని, దాదాపు 170 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ సినిమాని నిర్మిస్తున్నారని ఇప్పటికే వార్తలు వచ్చాయి. అయితే, ప్రస్తుతం ఈ సినిమా యాక్షన్ సీక్వెన్స్ ను షూట్ చేస్తోన్నట్లు తెలుస్తోంది. మరో వారం రోజులు పాటు ఇంటర్వెల్ లో వచ్చే ఈ సీక్వెన్స్ నే షూట్ చేయనున్నారు. కాగా మొఘల్ కాలం నాటి ఫిక్షన్ కథతో తెరకెక్కుతున్న ఈ సినిమా భారీ సెట్స్ వేసి షూట్ చేస్తున్నారట. .

ఇక ఈ సినిమాలో పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే మరో హీరోయిన్ గా జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తోంది. కాగా ఈ సినిమాని పాన్ ఇండియన్ సినిమాగా తీసుకురానున్నారు. అందుకే క్రిష్ ఈ సినిమాకి మరింత గ్రాండ్ నెస్ ను తీసుకు వచ్చేందుకు పరభాషా నటులను కూడా తీసుకున్నారు. ఇక ప్రముఖ నిర్మాత ఏ ఎమ్ రత్నం మొత్తానికి ఈ సినిమాని భారీగా నిర్మిస్తున్నారు. ఈ పిరియాడికల్ మూవీ సంక్రాంతి బరిలోనే నిలవబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు