పవన్ అభిమానులకు అసహనం ఎక్కువైంది

పవన్ అభిమానులకు అసహనం ఎక్కువైంది

Published on Feb 24, 2020 3:08 PM IST

పవన్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తుండటంతో ఆయన సినీ అభిమానులు మళ్లీ యాక్టివ్ అయ్యారు. ఇప్పటికే పవర్ స్టార్ వేణు శ్రీరామ్ డైరెక్షన్లో ఒక చిత్రం, క్రిష్ దర్శకత్వంలో మరొక చిత్రం చేస్తుండటంతో వాటికి సంబంధించిన అప్డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. దిల్ రాజు నిర్మాణంలోని ‘పింక్’ తెలుగు రీమేక్ మొదటగా విడుదలకానుండటంతో షూటింగ్ విశేషాలను ఎప్పటికప్పుడు చెబుతుండాలని, వీలైనంత త్వరగా ఫస్ట్ లుక్, టైటిల్ రివీల్ చేయాలని కోరుతున్నారు.

కానీ విడుదలకు చాలా టైమ్ ఉండటం, షూటింగ్ జరుగుతుండటంతో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నుండి పెద్దగా సినిమా సంగతులు బయటకు రావట్లేదు. దీంతో అభిమానులు సోషల్ మీడియాలో వియ్ వాంట్ అప్డేట్ అంటూ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు. అలాగే క్రిష్ చిత్ర నిర్మాణ సంస్థ అయిన మెగా సూర్య ప్రొడక్షన్స్ వారిపై కూడా అప్డేట్స్ ఇవ్వండి అంటూ ఒత్తిడి తెస్తున్నారు. మరి వారి కోరికను మన్నించి నిర్మాతలు కొత్త విశేషాలు ఏవైనా చెబుతారేమో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు