నితిన్ సినిమా వేడుకకు ముఖ్య అతిధిగా పవన్ కళ్యాణ్ !

నితిన్ సినిమా వేడుకకు ముఖ్య అతిధిగా పవన్ కళ్యాణ్ !

Published on Mar 22, 2018 4:53 PM IST

నితిన్ తాజాగా నటించిన తాజా సినిమా `ఛల్ మోహన్ రంగ`. ‘రౌడీ ఫెలో’ సినిమాతో దర్శకుడిగా మారిన కృష్ణ చైతన్య ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు పవన్ కల్యాణ్ – సుధాకర్ రెడ్డి లు నిర్మాతలుగా వ్యవహరించారు. తమన్ సంగీతం అందించిన ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ నెల 25 న హైదరాబాద్ లో జరగనుంది. పవన్ కళ్యాణ్ ఈ వేడుకకు ముఖ్య అతిధిగా హాజరుకాబోతున్నారు.

త్రివిక్రమ్ కథ అందించిన ఈ సినిమాలో మేఘా ఆకాష్ హీరోయిన్ గా నటించింది. నితిన్‌‌కి ‘ఛల్ మోహన్ రంగ’ 25వ చిత్రం. ఈ మూవీ టీజర్, సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్ లభించడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఏప్రిల్ 5న సినిమాను విడుదల చెయ్యడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు